Janasena Pawan Kalyan: తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: జనసేన అధినేత పవన్ కల్యాణ్
Pawan Kalyan: తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం..
Pawan Kalyan: తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్ది ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని అన్నారు. శాసించే స్థాయిలో ఉండాల్సిన కాపులు యోచించే స్థాయిలోనే ఉన్నారని వాపోయారు. రాజకీయంగా, సామాజికంగా కాపుల్లో, బీసీ కులాల్లో అసమానతలున్నాయని అన్నారు. కాపుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు
రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపులను ఓటు బ్యాంకుగా చూడడానికి ప్రతి రాజకీయ పార్టీ ఆమనేయాలని ఆయన హితవు పలికారు. తాను ఓ కులానికి ప్రతినిధి కాదని, అందరివాడినని అన్నారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని చెప్పారు. ఉద్దానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని ఆరోపించారు. ఆయా వర్గాల నేతల రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే కార్పోరేషన్ల ఏర్పాటని ఆయన వ్యాఖ్యానించారు.
Chiru Join in Janasena: జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ రివీల్ చేసేశారు..