Dhulipalla Narendra: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు.. ఎందుకంటే..?
TDP Leader Dhulipalla Narendra Kumar: టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్
TDP Leader Dhulipalla Narendra Kumar: టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ను స్వాధీనం చేసుకునే క్రమంలో నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ తెలిపారు. సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని జవహర్ లాల్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు ఈ ఆసుపత్రిలో రాయితీతో వైద్యం అందిస్తున్నారు. కాగా కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం ట్రస్ట్ను స్వాధీనం చేసుకునే విషయంలో పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: