కరోనా అప్‌డేట్స్: ఏపీలో భారీగా నమోదైన కేసులు..!

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,246 టెస్ట్‌లు నిర్వహించారు. అందులో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

కరోనా అప్‌డేట్స్: ఏపీలో భారీగా నమోదైన కేసులు..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 2:26 PM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,246 టెస్ట్‌లు నిర్వహించారు. అందులో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3843కు చేరింది. ఇక తాజాగా 34 మంది కరోనాను జయించగా.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2387కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1381 యాక్టివ్ కేసులు ఉండగా.. మరణించిన వారి సంఖ్య 75గా నమోదైంది. అయితే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.

ఇక మరోవైపు విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 29 కేసులు వచ్చాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 132 మంది కరోనా బారిన పడగా.. వారిలో 6 మంది కోలుకున్నారు. 126 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 838 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా.. అందులో 520 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 4లక్షల 50వేలపైనే కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,650కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 1742 మంది డిశ్చార్జి అవ్వగా.. 1771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో 137 మంది మృత్యువాతపడ్డారు.

Read This Story Also: ఫ్యాన్స్‌కి భయపడి రజనీ సినిమాను వదులుకున్న స్టార్ నటుడు..!