శ్రావణి కేసు: పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు
Anchor Sravani Suicide: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న నటుడు దేవరాజ్ తమ ముందు లొంగిపోయాడని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. పోలీసుల ఆదేశాల మేరకు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిన దేవరాజ్ విచారణకు హాజరయ్యాడు. అతడి స్టేట్మెంట్ని పోలీసులు రికార్డు చేయనున్నారు. తన వద్ద ఉన్న కాల్ రికార్డులను దేవరాజ్ పోలీసులకు సమర్పించాడు. దీనిపై మాట్లాడిన సీఐ.. దేవరాజ్ని విచారిస్తున్నామని, ఈ కేసులో సాయికృష్ణారెడ్డి సభ్యులను కూడా విచారిస్తున్నామని తెలిపారు. నిందితులు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
కాగా దేవరాజ్ తన కుమార్తెను వేధింపులకు గురిచేశాడని శ్రావణి కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మరో అనుమానితుడు సాయికృష్ణారెడ్డి కూడా దేవరాజ్ వలనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాడు. మరోవైపు సాయికృష్ణా రెడ్డే చిత్రహింసలకు గురి చేసినట్లు శ్రావణి తనకు చెప్పిందని దేవరాజ్ వాదిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు శ్రావణి అంత్యక్రియలు స్వగ్రామం కాకినాడలో నిర్వహించనున్నారు.
Read More:
అంతర్వేది ఘటన: సమస్య పరిష్కారం అయినట్టు కాదు.. ‘సీబీఐ’ దర్యాప్తుపై పవన్