చాలా కష్టపడ్డాం కానీ..: హుందాగా స్పందించిన అల్లు శిరీష్

ఇటీవల ఏబీసీడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు వారబ్బాయి శిరీష్. మలయాళ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయితే ఈ విషయాన్ని అంగీకరించిన శిరీష్.. మూవీ ఫలితంపై సోషల్ మీడియాలో హుందాగా స్పందించాడు. ‘‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరి ప్రేమ, అభిమానం నన్ను ముగ్దుడిని చేసింది. దర్శకుడు సంజీవ్ రెడ్డి, ఏబీసీడీకి పనిచేసిన అందరూ సినిమా కోసం చాలా […]

చాలా కష్టపడ్డాం కానీ..: హుందాగా స్పందించిన అల్లు శిరీష్
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 11:40 AM

ఇటీవల ఏబీసీడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు వారబ్బాయి శిరీష్. మలయాళ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయితే ఈ విషయాన్ని అంగీకరించిన శిరీష్.. మూవీ ఫలితంపై సోషల్ మీడియాలో హుందాగా స్పందించాడు.

‘‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరి ప్రేమ, అభిమానం నన్ను ముగ్దుడిని చేసింది. దర్శకుడు సంజీవ్ రెడ్డి, ఏబీసీడీకి పనిచేసిన అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాం. ప్రేక్షకుల తీర్పును నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నా. ఈ ప్రయాణంలో మాకు వెన్నుండిన నిర్మాతలు యశ్, శ్రీధర్‌లకు ధన్యవాదాలు. సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నేను చేసే ప్రయత్నాలను నన్ను సపోర్ట్ చేస్తోన్న స్నేహితులు, సన్నిహితులు, మీడియా వారికి కూడా థ్యాంక్స్. నేను మరింత కష్టపడి, భవిష్యత్‌లో మీరు మెచ్చేలా మంచి చిత్రాలను మీ ముందుకు తీసుకొస్తాను’’ అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. కాగా ఈ ట్వీట‌్‌పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విజయవంతం అవ్వకున్నా.. సక్సెస్‌మీట్‌లు పెట్టి నడిపించే ఈ కాలంలో తన సినిమా పరాజయంపై అల్లు శిరీష్ స్పందించిన తీరు అభినందనీయమని వారు కామెంట్లు పెడుతున్నారు.