దళితమంత్రిపై అసభ్యకర పోస్టులు : ఆర్కే
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అసత్యమని.. అవన్నీ టీడీపీ శ్రేణుల పనే అని ఆరోపించారు. దళిత మంత్రి మీద అసభ్య పదజాలం వాడుతున్నారన్నారు. సమగ్రమైన విచారణ జరిపి, అసలైన నిందితుల్ని పట్టుకోవాలని డీజీపీని కోరినట్టు చెప్పారు. సీఎం జగన్, హోం మంత్రి సుచరితపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు […]
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అసత్యమని.. అవన్నీ టీడీపీ శ్రేణుల పనే అని ఆరోపించారు. దళిత మంత్రి మీద అసభ్య పదజాలం వాడుతున్నారన్నారు. సమగ్రమైన విచారణ జరిపి, అసలైన నిందితుల్ని పట్టుకోవాలని డీజీపీని కోరినట్టు చెప్పారు. సీఎం జగన్, హోం మంత్రి సుచరితపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని, కిరాయి గూండాలతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ఓటేశారనే కారణంతో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.