ఢిల్లీ ఎయిమ్స్ లో ఓపీడీ అడ్మిషన్లకు తాత్కాలికంగా బ్రేక్
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నాన్-కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతూ వారిని తరచూ ఎమర్జెన్సీ వార్డుల్లో చేర్చవలసి వస్తుండడంతో 'రద్దీ' పెరిగిన దృష్ట్యా జనరల్..
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నాన్-కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతూ వారిని తరచూ ఎమర్జెన్సీ వార్డుల్లో చేర్చవలసి వస్తుండడంతో ‘రద్దీ’ పెరిగిన దృష్ట్యా జనరల్, ప్రైవేట్ వార్డుల్లో ఓపీడీ అడ్మిషన్లను రెండువారాల పాటు నిలిపివేశారు. అయితే వైద్య సలహాలు, కౌన్సెలింగ్ కోసం రోగులు రావచ్ఛునని ఓ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ట్రామా సెంటర్ ని కూడా కోవిడ్ సెంటర్ గా మార్చవలసి వచ్చిందని అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. రెండు వారాల అనంతరం పరిస్థితిని సమీక్షించి మళ్ళీ నిర్ణయం తీసుకోనున్నారు.