ఇది షాకింగే…ఆరోన్ ఫించ్ తన జట్టులో రోహిత్కు ఛాన్స్ ఇవ్వలేదు..
ఈ మధ్య ఎవరు తమ వరల్డ్ ఎలెవన్ తయారు చేసినా రోహిత్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ అనౌన్స్ చేసిన ఆసీస్-భారత్ కంబైన్డ్ జట్టులో మాత్రం హిట్మ్యాన్కు చోటివ్వలేదు.
రోహిత్ శర్మ..ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో టాప్ ప్లేయర్. ఏ ఫార్మాట్ అయినా రోహిత్ ట్రాక్ రికార్డ్ అనితర సాధ్యం. ముఖ్యంగా వన్డేలలో అయితే రోహిత్ రికార్డుల హోరు మాములుగా ఉండదు. ఈ మధ్య ఎవరు తమ వరల్డ్ ఎలెవన్ తయారు చేసినా రోహిత్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ అనౌన్స్ చేసిన ఆసీస్-భారత్ కంబైన్డ్ జట్టులో మాత్రం హిట్మ్యాన్కు చోటివ్వలేదు. ఓపెనర్స్ గా సెహ్వాగ్, గిల్క్రిస్ట్లను ఎంపిక చేశాడు.
“సెహ్వాగ్ ఫస్ట్ క్లాస్ ప్లేయర్. ప్రత్యర్థిని ఎప్పుడూ డామినేట్ చేస్తాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి టీమ్ గెలుపుపై నమ్మకం వదులుకోవాల్సిందే. మరో ఓపెనర్గా రోహిత్ను సెలక్ట్ చేద్దామనుకున్నా. కానీ సెహ్వాగ్, గిల్క్రిస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే చూడాలనుకున్నా. అందుకే గిల్క్రిస్ట్ను ఎంపిక చేశా” అని ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు.
ఇక థర్డ్, ఫోర్త్ ప్లేసుల్లో రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశాడు ఫించ్. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో టాప్ క్లాస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, ఆండ్రూ సైమండ్స్ను సెలక్ట్ చేశాడు. ఏడవ స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఛాన్స్ ఇచ్చాడు. ధోనీ, గిల్క్రిస్ట్ ఎవరైనా కీపింగ్ చేయొచ్చని అన్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే బ్రెట్లీ, మెక్గ్రాత్, జస్ప్రీత్ బుమ్రాను ఎంచుకున్నాడు. కానీ స్పిన్నర్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. “బ్రాడ్ హాగ్ రికార్డు ఇంప్రెసీవ్ గా ఉంది. రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్ లను తీసుకుంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వీరిలో ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదు.” అంటూ చెప్పుకొచ్చాడు ఫించ్.
ఫించ్ ఆసీస్-భారత్ ఎలెవన్ జట్టు : వీరేంద్ర సెహ్వాగ్ (ఓపెనర్), ఆడమ్ గిల్క్రిస్ట్ (ఓపెనర్), రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, ఆండ్రూ సైమండ్స్, ధోనీ, బ్రెట్లీ, (ఈ ప్లేస్ సెలక్ట్ చేయలేదు), మెక్గ్రాత్, జస్ప్రీత్ బుమ్రా.