తమిళనాడులో సీన్ రిపీట్.. తగ్గని కేసులు
తమిళనాడులో సీన్ రిపీట్ అవుతోంది. రోజు ఆరు వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా..
తమిళనాడులో సీన్ రిపీట్ అవుతోంది. రోజు ఆరు వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,426 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,34,114కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 57,490 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 82 మంది మరణించారు. ఇక బుధవారం నాడు కరోనా నుంచి కోలుకుని 5,927 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
6,426 new #COVID19 cases and 82 deaths reported in Tamil Nadu in the last 24 hours, taking the total to 2,34,114. 5,927 patients were discharged today. 57,490 cases still active in the state: Health & Family Welfare Department, Tamil Nadu pic.twitter.com/jllYBBM4NP
— ANI (@ANI) July 29, 2020
Read more