వివేకా హత్య కేసులో వాచ్మెన్కు నార్కో పరీక్షలు
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బంధువు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. మూడు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపధ్యంలో హత్యకేసులో కీలకంగా మారిన నిందితుడు, వివేక ఇంటి వాచ్మెన్ రంగయ్యకు నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రంగయ్యను హైదరబాద్కు తరలిస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం ఈ హత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు […]
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బంధువు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. మూడు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపధ్యంలో హత్యకేసులో కీలకంగా మారిన నిందితుడు, వివేక ఇంటి వాచ్మెన్ రంగయ్యకు నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రంగయ్యను హైదరబాద్కు తరలిస్తున్నారు.
అయితే గత టీడీపీ ప్రభుత్వం ఈ హత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సైతం నియమించింది. ఒక దశలో వివేకానందరెడ్డి కుమార్తె సిట్ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సైతం లేఖ ఇచ్చారు. వివేకాను అసలు ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలు సస్పెన్స్గా మారాయి. ఇదిలా ఉంటే దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్యకు నార్కో పరీక్షలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా మరో నిందితుడు కారుడ్రైవర్ దస్తగిరిని కూడా ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. తన డ్రైవర్ను తొందరగా రావాలని కోరినందుకు తనను చచ్చేలా కొట్టాడని వివేకా దస్తూరీతో ఉన్న ఓ లేఖ హత్య జరిగిన ప్రదేశంలో లభ్యమైంది.