అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్కు చెందిన నలుగురు సజీవదహనం
కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్కు వెకేషన్కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్కు వెకేషన్కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.