నేపాల్లో విమాన ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లుక్లాలోని తెన్జింగ్ హిల్లరీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా సమ్మిట్ ఎయిర్కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తు అక్కడి హెలిప్యాడ్లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విమానం లుక్లా నుంచి ఖాఠ్మండ్కు వెళ్లాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రామ్బహదూర్, కో పైలట్ డుంగానా, బహదూర్ శ్రేష్ట్గా గుర్తించారు. […]
నేపాల్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లుక్లాలోని తెన్జింగ్ హిల్లరీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా సమ్మిట్ ఎయిర్కు చెందిన ఓ విమానం ప్రమాదవశాత్తు అక్కడి హెలిప్యాడ్లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విమానం లుక్లా నుంచి ఖాఠ్మండ్కు వెళ్లాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రామ్బహదూర్, కో పైలట్ డుంగానా, బహదూర్ శ్రేష్ట్గా గుర్తించారు. విమానంలో ఉన్న పైలట్తో పాటు హెలికాప్టర్లోని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే ఖాఠ్మండ్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.