అయోధ్య తీర్పుకు, నవంబర్ 17వ తేదీకి లింకేంటి..?

అయోధ్య.. మరోసారి తెరపైకి వచ్చిన అంశం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడు వెలవడుతుందో అన్న దానిపై అంతా ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా 40 రోజుల పాటు విచారించింది. దీంతో సుప్రీం చ‌రిత్ర‌లో అతిసుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగిన రెండవ కేసుగా […]

అయోధ్య తీర్పుకు, నవంబర్ 17వ తేదీకి లింకేంటి..?
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 3:07 PM

అయోధ్య.. మరోసారి తెరపైకి వచ్చిన అంశం. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎప్పుడు వెలవడుతుందో అన్న దానిపై అంతా ఎదురుచూస్తున్నారు.

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరుసగా 40 రోజుల పాటు విచారించింది. దీంతో సుప్రీం చ‌రిత్ర‌లో అతిసుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగిన రెండవ కేసుగా ఇది రికార్డులో నిలిచింది. గ‌తంలో కేశ‌వానంద భార‌తి కేసులో సుప్రీం ధ‌ర్మాస‌నం అత్య‌ధికంగా 68 రోజుల పాటు విచారించింది. ఇక ఆధార్ కేసును అత్యున్న‌త న్యాయ‌స్థానం 38 రోజుల పాటు విచారించింది. అయోధ్య కేసులో అల‌హాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్య‌తిరేకిస్తూ మొత్తం 14 కేసులు దాఖ‌ల‌య్యాయి. అయోధ్య‌లో వివాదాస్ప‌దంగా ఉన్న 2.77 ఎక‌రాల భూమిని మూడు భాగాలు పంచాల‌ని గ‌తంలో తీర్పునిచ్చారు. సున్నీ వ‌క్ఫ్ బోర్డు, నిర్మోహి అకాడా, రామ్ ల‌ల్లాకు ఇవ్వాల‌ని సూచించారు. హిందువుల మ‌నోభావాల‌కు కేంద్ర బిందువుగా మారిన అయోధ్య కేసులో.. తుది తీర్పు న‌వంబ‌ర్ 17వ తేదీలోగా వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే అయోధ్య తీర్పుకు.. నవంబర్ 17వ తేదీకి మధ్య అసలు లింకు ఏంటి అన్నదానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.  వచ్చే నెలలోనే చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ రిటైర్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా ఓ చారిత్రాత్మక తీర్పును ఆయనే ఇస్తారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. కొన్ని జాతీయ వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ 17వ తేదీ లోపు తీర్పు రాబోతోందని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. నవంబర్ 17వ తేదీ ఇద్దరు హిందూ నేతలు పరమపదించిన రోజు. అంతేకాదు వారు ఇద్దరు కూడా బాబ్రీ మసీదు వివాదంలో ఉన్న నేతలే. వారు ఒకరు విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్, మరో నేత శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే. ఒకరేమో ప్రత్యక్షంగా బాబ్రీ కూల్చివేతలో పాల్గొంటే.. మరోకరు పరోక్షంగా పాల్గొన్నారు.

అశోక్ సింఘాల్‌పై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే బాల్ థాక్రే మాత్రం ఆయన క్యాడర్ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ప్రకటించుకున్నారు. అయితే వీరిరువురు కూడా ఒకే తేదీన మరణించారు. అయితే వారి చిరకాల స్వప్నం భవ్య రామ మందిర నిర్మాణమని.. ఈ నేపథ్యంలో అదే రోజు మందిరానికి అనుకూలంగా తీర్పు రాబోతున్నట్లు ఆ సంస్థల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే నవంబర్ 17 తేదీన తీర్పు రాబోతుందా.. లేదా ముందే వెలువడుతుందా అన్నది మరి కొద్ది రోజులు వేచి చూస్తే తేలిపోతుంది.

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం