బ్రేకింగ్: అత్యాచారం కేసు.. విజయవాడ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

అత్యాచారం కేసులో విజయవాడ ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. గత ఏడాది జనవరిలో మైనర్ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారం చేయగా.. అతడిని ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది. అయితే  సంచలనం సృష్టించిన దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో.. అమ్మాయిలపై అత్యాచారం […]

బ్రేకింగ్: అత్యాచారం కేసు.. విజయవాడ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు
Follow us

| Edited By:

Updated on: Dec 02, 2019 | 8:47 PM

అత్యాచారం కేసులో విజయవాడ ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. గత ఏడాది జనవరిలో మైనర్ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారం చేయగా.. అతడిని ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది. అయితే  సంచలనం సృష్టించిన దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో.. అమ్మాయిలపై అత్యాచారం చేసే వారిని ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో అత్యాచార నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.