ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

Updated on: Jan 22, 2026 | 9:08 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. 19 ఏళ్ల కాజల్ సైనీ, 27 ఏళ్ల మహమ్మద్ అర్మాన్‌ల ప్రేమ వ్యవహారం వారి ప్రాణాలను తీసింది. బాలిక సోదరులు రింకు సైనీ, సతీష్ సైనీ ఈ జంటను దారుణంగా హత్య చేసి పొలంలో పాతిపెట్టారు. ఈ ఘటన ఉమ్రీ సబ్జీపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో జరిగిన పరువు హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రేమించుకున్న 19 ఏళ్ల కాజల్ సైనీ, 27 ఏళ్ల మహమ్మద్ అర్మాన్‌లను బాలిక సోదరులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉమ్రీ సబ్జీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, కాజల్ సైనీ, మహమ్మద్ అర్మాన్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ వ్యవహారం బాలిక కుటుంబ సభ్యులకు ఆమోదయోగ్యం కాలేదు. జనవరి 18న రాత్రి అర్మాన్, కాజల్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో, బాలిక సోదరులు రింకు సైనీ, సతీష్ సైనీ వారిని చూశారు. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరులు ఇద్దరినీ దారుణంగా హతమార్చారు. అనంతరం వారి మృతదేహాలను గగన్ నది సమీపంలోని పొలాల్లో పాతిపెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

ట్రాఫిక్‌ చలాన్ల బలవంతపు వసూళ్లకు చెక్‌.. హైకోర్ట్‌ కీలక ఆదేశాలు

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

Loading...
Unable to load recommendations.
Follow Us