భర్త కళ్లలో కారం కొట్టి హత్య… కారణం ఇదే వీడియో

Updated on: Sep 02, 2025 | 9:24 PM

ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులే బంధాలను మరిచి మారణహోమాలు చేస్తున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని కొందరు మద్యం సేవించి వచ్చి గొడవ చేస్తున్నారని మరికొందరు ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. పసిపిల్లలను సైతం పొట్టన పెట్టుకుంటూ కసాయి వాళ్ళుగా మారుతున్నారు. తాజాగా ఒక మహిళ భర్త వేధింపులు భరించలేక అతన్ని కళ్ళల్లో కారం చల్లి ఉరిబిగించి చంపేసింది. ఆ తర్వాత ఘోరం జరిగిపోయిందని లబోదిబోమంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుమార్ అనే వ్యక్తిని అతని భార్య చంపడం జరిగింది. కారణం ఏంటంటే తెలుసుకుంటే ఆమె అతను  రోజు తాగేసి వచ్చి భార్యని బాగా వేధించడం కొట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటే నిన్న శనివారం రోజు కూడా తాగేసి వచ్చి గొడవ పడ్డాడు. ఆ భయానికి ఆమె పారిపోయింది. ఆమె తల్లిగారి ఇంటి దగ్గర ఉండి నెక్స్ట్ డే అంటే ఆదివారం మార్నింగ్ పనిచేసే దగ్గరకు వచ్చేసి ఉంటే మార్నింగ్ కూడా తాగి భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవలో క్షణిక ఆవేశంలో ఎప్పటికైనా ఇతను నన్ను ఇదే విధంగా హింసిస్తాడని చెప్పేసి ఆమె మనసులో పెట్టుకొని అదును చూసేసి ఎవ్వరు లేని చూసేసి అతన్ని కళ్ళలో కారం చల్లి మెడకు ఆమె సారీతోటి ఉరి వేసేసి చంపడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం కేసారంలోని ఒక ఎంచర్లో కుమార్ రేణుకా దంపతులు జీవనం సాగిస్తున్నారు. కుమార్ రోజూ మద్యం సేవించి రేణుకాతో గొడవ పడుతూ ఉండేవాడు. భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో రేణుకా విసిగిపోయింది. ఎప్పటిలాగే ఆదివారం కూడా మద్యం సేవించి వచ్చిన కుమార్ భార్యతో గొడవకు దిగాడు. అప్పటికే భర్త వేధింపులతో విసిగిపోయి ఉన్న రేణుకా భర్త కళ్ళల్లో కారం చల్లి చీరతో అతని మెడకు ఉరిబిగించి హత్య చేసింది. భర్త చనిపోవడంతో కంగారుపడిన రేణుకా క్షణిక ఆవేశంలో తప్పు చేశానంటూ బోరున ఏడ్చింది.

మరిన్ని వీడియోల కోసం :

కోళ్లగూడులో ఊహించని సీన్‌.. భయంతో పరుగులు తీసిన రైతు వీడియో

పాముకి చుక్కలు చూపించిన పిల్లి.. చివరికి వీడియో

విడాకులిచ్చిన భార్యకు షాక్.. భర్తకు జాక్‌పాట్‌.. ఏం జరిగిందట వీడియో