సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూ*సైడ్ వీడియో
తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన గార్మెంట్ కంపెనీ ఓనర్ అన్నాదురై కుమార్తె రిధన్య వివాహం ఏప్రిల్లో కవిన్కుమార్తో జరిగింది. అయితే, పెళ్లిలో 80 తులాల బంగారు ఆభరణాలు, రూ.70 లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. 2.5 కోట్లు ఖర్చు చేసి వివాహం అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం అత్తవారింటికి వెళ్లిన రిధన్యకు అంతలోనే వేధింపులు మొదలయ్యాయని చెప్పింది.
వివాహం జరిగిన పది రోజుల్లోనే ఆమెను వరకట్నం కోసం వేధించినట్టుగా తెలిసింది. తన భర్త కవిన్ కుమార్ తనను శారీరకంగా, మామ, అత్తగారు తనను మానసికంగా హింసిస్తున్నారని, ఆమె తన తండ్రికి చెప్పింది. తాను ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని తెలిపింది. కానీ ఆమె తల్లిదండ్రులు అంతా బాగానే ఉంటుందని తమ కూతురిని ఓదార్చారు. తిరిగి అత్తవారింటికి పంపించారు.ఆదివారం రిధన్య మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆమె తన కారును ఆపి పురుగుమందుల మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అక్కడే చాలా సేపు ఆగివున్న కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. కారు లోపల రిధన్య చనిపోయి, నోటి నుండి నురుగుతో కనిపించిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మరిన్నివీడియోల కోసం :