తాళ్లపాక చెరువులో చెట్లు తొలగిస్తుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం

Updated on: Jul 22, 2025 | 4:06 PM

పద కవితా పితామహుడు తొలితెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ అన్నమాచార్యుడు జన్మించిన తాళ్లపాక చెరువులో పురాతన శివలింగం బయటపడింది. చెరువులోని కంప చెట్లను తొలగిస్తూ ఉండగ నాలుగు అడుగుల శివలింగం దర్శనమిచ్చింది. ఆ శివలింగానికి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక అన్నమాచార్యుల ధ్యాన మందిరం పక్కనే చెరువు ఉంది.

ఆ చెరువులో పురాతన కాలంనాటి శివలింగం బయట పడింది. ఆ చెరువులో గతంలో నేరేడుమిట్ట ఉంది. అక్కడే శివలింగం ఉంది. నేరేడుమిట్ట మీద ఉన్న ఆ శివలింగాన్ని నేరేడీశ్వరుడు అని అంటారు. అలాగే నీలకంటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. పూర్వం అక్కడ గుడి ఉండి ఉండవచ్చని, అందువల్లనే అక్కడ శివలింగం ఉందని పూజారులు అంటున్నారు. సోమవారం తాళ్లపాకలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం పూర్తి కాగానే పూజారులు చెరువులోని శివలింగం వద్దకు వెళ్లి అక్కడ శివలింగాన్ని శుభ్రపరిచి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో తాళ్లపాక గ్రామంలోని పలువురు మహిళలు, భక్తులు హాజరై ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు. ఈ శివలింగం శతాబ్దాల నాటిదై ఉండవచ్చునని స్థానికులు అంటున్నారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు శివలింగం వద్దకు వచ్చి పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శివలింగం బయలుపడ్డ ప్రాంతంలో శివాలయం నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పురాతన వారసత్వ సంపదను కాపాడుకుంటామని వారు చెప్పారు. మొత్తం మీద తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించిన జన్మస్థలంలో పురాతన శివలింగం బయటపడడంతో ఈ శివలింగానికి విశేష చరిత్ర కలిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. దీని చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తామని వారన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనుషుల సమాధుల మధ్య రెస్టారెంట్‌.. అవే నా అదృష్టం అంటున్న ఓనర్

ఇంటి కరెంట్‌ బిల్లు చూసి షాక్‌ తిన్న రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌.. ఏకంగా

డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు

భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. డేంజర్లో పడ్డట్లే!

విమానం కంటే వేగం ఈ రైలు.. గంటకు 600 కి.మీ

Published on: Jul 22, 2025 04:05 PM