Guntur: దర్జాగా గుడిలోకి వచ్చారు.. కూల్గా పని కానిచ్చారు.. ఆ తర్వాత
అత్తారింటికి వచ్చినట్టు వచ్చారు.. దర్జాగా చేయాల్సిన పని చేసి.. కూల్గా పక్కకి వెళ్లారు. ఆ తర్వాత సీన్ చూస్తే మైండ్ బ్లాంక్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? సీసీటీవీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు ఏంటంటే.?
ఈ కలికాలంలో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండాపోతోంది. దేవుళ్ల విగ్రహలను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉపాయం ఏదైనా ఉంటే బాగుండనిపిస్తుంది. లేకుంటే గుళ్ల హుండీలు దొంగలకు ఏటీఎంలు అయిపోతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి శ్రీ జల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ముసుగులు వేసుకుని ముగ్గురు వ్యక్తులు ఆలయంలో వచ్చి రూ. 2 లక్షల వరకు నగదును చోరీ చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాల ద్వారా ఎంతమేరకు నగదు మాయం అయిందో ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.. వారి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు.