అయ్యప్పస్వామి భక్తులకు గుడ్‌ న్యూస్‌ !! స్వామి దర్శన సమయం గంట పెంపు

|

Dec 14, 2023 | 8:22 PM

అయ్యప్పభక్తులకు గుడ్‌ న్యూస్‌.. శబరిమల అయ్యప్పస్వామి దర్శన సమయాన్ని పెంచుతూ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా అయ్యప్ప స్వామి భక్తులు పెరుగుతుండటంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులతో కొండలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు వీలైనంత త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా దర్శన సమయాన్ని గంటపాటు పెంచారు. రోజులో రెండో భాగంలో ఈ దర్శన సమయాన్ని పెంచారు.

అయ్యప్పభక్తులకు గుడ్‌ న్యూస్‌.. శబరిమల అయ్యప్పస్వామి దర్శన సమయాన్ని పెంచుతూ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా అయ్యప్ప స్వామి భక్తులు పెరుగుతుండటంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులతో కొండలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు వీలైనంత త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా దర్శన సమయాన్ని గంటపాటు పెంచారు. రోజులో రెండో భాగంలో ఈ దర్శన సమయాన్ని పెంచారు. సాధారణంగా రోజులో రెండోభాగంలో సాయంత్రం 4 గంటలకు దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. ఇప్పుడు దీనిని సాయంత్రం నాలుగు గంటలకు బదులు 3 గంటలకు మార్చారు. ఫలితంగా దర్శన సమయం గంట పెరిగింది. ఇక నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు రెండోదశ దర్శనాలు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైలం పాతాళగంగ వద్ద నీటి కుక్కల సందడి

గూగుల్‌ని గుడ్డిగా నమ్మితే ఇలానే గుంటలోకి దింపుతుంది

తాంత్రిక పూజల పేరుతో 20 మందిని హత్య చేసిన కిల్లర్ !!

జంట హత్యల కేసులో ఖైదీ.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డాడు

Follow us on