YS Jagan: రెడ్ బుక్ అంటున్నవారికి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం: వైసీపీ అధినేత జగన్

Updated on: Sep 24, 2025 | 5:24 PM

ఇప్పుడు రెడ్‌బుక్‌ అంటున్న వాళ్లకు డిజిటల్‌ బుక్‌ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ డిజిటల్‌ బుక్‌ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్‌ బుక్‌ ఉపయోగించుకోవాలన్నారు.

ఇప్పుడు రెడ్‌బుక్‌ అంటున్న వాళ్లకు డిజిటల్‌ బుక్‌ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ డిజిటల్‌ బుక్‌ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్‌ బుక్‌ ఉపయోగించుకోవాలన్నారు జగన్‌. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామన్నారు. సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు జగన్‌. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామని.. చట్టం ముందు నిలబెడతామని జగన్ పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us