పొంగల్ పోటీ చూసారా.. ఈసారి దండయాత్రే..

Updated on: Apr 13, 2026 | 5:16 PM

వచ్చే సంక్రాంతికి సీనియర్ హీరోలతో పాటు యువ హీరోల సినిమాలు భారీ పోటీకి సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ దండయాత్రతో థియేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉంది. శ్రీను వైట్ల-శర్వానంద్, తేజ సజ్జ, రష్మిక మందనల మైసా చిత్రాలు పండగను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ తీవ్ర పోటీలో ఎవరు నిలబడతారో చూడాలి.

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర పోటీ నెలకొననుంది. సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా తమ సినిమాలతో పండగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సాధారణంగా సీనియర్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడే చిన్న సినిమాలకు థియేటర్ల కొరత ఎదురవుతుంది. కానీ ఈసారి సీనియర్లతో పాటు యువ తారలు కూడా బరిలోకి దిగుతుండటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. గట్టి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని చూస్తున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఒకటి సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుంది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తేజ సజ్జ చిత్రం కూడా పండగ సీజన్‌కు షెడ్యూల్ అయింది. వీళ్లతో పాటు నేషనల్ క్రష్ రష్మికా మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న మైసా సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srinidhi Shetty: హిట్ లేకున్నా శ్రీనిధికి బంపర్ ఆఫర్స్

Shahrukh Khan: పలకరించబోయిన షారుఖ్‌.. పట్టించుకోని రణ్‌వీర్‌

చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్‌లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే

విశ్వంభరకన్నా ముందే స్వయంభు.. ఇప్పుడిదే టాపిక్‌

బాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బయోపిక్‌లు

Loading...
Unable to load recommendations.
Follow Us