Vijayawada: మహిళేమో కొంచెం తేడా.. పైగా చేతిలో ఉన్న బ్యాగ్‌పై అనుమానం.. చెక్ చేయగా.!

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాష్ట్రంలో అక్రమ మద్యం, డబ్బు రవాణా జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీలోని విజయవాడ సమీపాన ఉన్న గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

Vijayawada: మహిళేమో కొంచెం తేడా.. పైగా చేతిలో ఉన్న బ్యాగ్‌పై అనుమానం.. చెక్ చేయగా.!

|

Updated on: Mar 28, 2024 | 4:58 PM

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాష్ట్రంలో అక్రమ మద్యం, డబ్బు రవాణా జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీలోని విజయవాడ సమీపాన ఉన్న గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అలా ఓ ఆర్టీసీ బస్సులో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఒక మహిళ అక్రమంగా ఏపీకి తరలిస్తున్న 37 బాటిల్స్ తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెంకాయమ్మ అనే మహిళ నల్లబండగూడెం నుంచి పెనుగంచిప్రోలు తిరునాళ్లలో మద్యాన్ని విక్రయించేందుకు చేతి సంచిలో ఈ మందు బాటిల్స్‌ను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.

Follow us