అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రోజు ఎక్కడో ఓ చోట ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అనంత్‌నాగ్‌లోని వఘామా ప్రాంతంలో తెల్లవారు జామున ఉగ్రవాదులకు..

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 9:24 AM

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రోజు ఎక్కడో ఓ చోట ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అనంత్‌నాగ్‌లోని వఘామా ప్రాంతంలో తెల్లవారు జామున ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్‌ పోలీసులు.. రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఇటీవల బిజ్‌బెహరా ప్రాంతంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను, ఓ ఐదేళ్ల చిన్నారిని చంపిన వారేనని జమ్ముకశ్మీర్ డైరక్టర్ జనరల్‌ దిల్బగ్‌ సింగ్ తెలిపారు.

Latest Articles