అనంత్నాగ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రోజు ఎక్కడో ఓ చోట ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అనంత్నాగ్లోని వఘామా ప్రాంతంలో తెల్లవారు జామున ఉగ్రవాదులకు..
కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రోజు ఎక్కడో ఓ చోట ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అనంత్నాగ్లోని వఘామా ప్రాంతంలో తెల్లవారు జామున ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు.. రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఇటీవల బిజ్బెహరా ప్రాంతంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను, ఓ ఐదేళ్ల చిన్నారిని చంపిన వారేనని జమ్ముకశ్మీర్ డైరక్టర్ జనరల్ దిల్బగ్ సింగ్ తెలిపారు.
In an encounter at Waghama Bijbehara, two terrorists who killed a Central Reserve Police Force (CRPF) jawan and a 5-year-old boy three days back at Bijbehara, have been eliminated: Dilbag Singh, Director General, Jammu & Kashmir Police (file pic) https://t.co/4A6NLdmTc1 pic.twitter.com/STWAKEkDzV
— ANI (@ANI) June 30, 2020