Breaking: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిపై ఏపీ ప్ర‌భుత్వం వేటు…రీజ‌న్ ఇదే

ఆస్తుల‌ అమ్మకపు ప్ర‌తిపాద‌న‌ల‌ సమాచారాన్ని మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిపై వేటు వేసింది. అత‌డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించడం వ‌ల్లే ఆయనను సస్పెండ్ చేసిన‌ట్లు పేర్కొంది.

Breaking: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిపై ఏపీ ప్ర‌భుత్వం వేటు...రీజ‌న్ ఇదే
Follow us

|

Updated on: Jun 26, 2020 | 5:28 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల వేలం విష‌యం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంపన‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియ‌స్ ప‌రిగ‌ణించిన ఏపీ స‌ర్కార్..ఆస్తుల‌ అమ్మకపు ప్ర‌తిపాద‌న‌ల‌ సమాచారాన్ని మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిపై వేటు వేసింది. అత‌డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించడం వ‌ల్లే ఆయనను సస్పెండ్ చేసిన‌ట్లు పేర్కొంది.

తమిళనాడులో తిరుమ‌ల వెంకన్న‌కు చెందిన నిరర్థక ఆస్తులను టీటీడీ అధికారులు వేలానికి పెట్టిన‌ట్లు కొద్దిరోజుల కిందట పెద్ద ఎత్తున వార్తలు వెలువ‌డ్డాయి. దీనికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. రాజ‌కీయ ప‌క్షాల‌తో పాటు పలు ధార్మిక సంఘాల ప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు ఈ నిర్ణ‌యం సరికాదంటూ ఆగ్ర‌హించారు. వ్య‌తిరేక‌త రావ‌డంతో ఈ ప్రతిపాదనలను టీటీడీ పక్కన పెట్టింది.

కాగా ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి అంత‌ర్గ‌త విచార‌ణ‌లో భాగంగా ఎస్టేట్ విభాగం అధికారులను విచారించారు. దేశవ్యాప్తంగా వెంక‌న్నకు ఉన్న స్థిరాస్తులను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. మీడియాకు ఇన్ఫ‌ర్మేష‌న్ లీక్ చేసిన వ్యవహారంలో ఎస్టేట్ ఆఫిస‌ర్ గా వ‌ర్క్ చేస్తోన్న‌ డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారి దేవేంద్ర రెడ్డి ప్రమేయం ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. దీనిపై గ‌వ‌ర్న‌మెంట్ కి ఓ నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా దేవేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు.