దంపతుల మధ్య గొడవ.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటికి చేరుకోగా కనిపించిన దృశ్యానికి గట్టి షాక్!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:16 PM

Viral News: సహజంగా భార్యాభర్తలు గొడవపడితే ఒకరినొకరు దూషించుకోవడం లేదా కొట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడొక జంట మాత్రం దానికి భిన్నంగా..

దంపతుల మధ్య గొడవ.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంటికి చేరుకోగా కనిపించిన దృశ్యానికి గట్టి షాక్!
Husband And Wife
Follow us on

సహజంగా భార్యాభర్తలు గొడవపడితే ఒకరినొకరు దూషించుకోవడం లేదా కొట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడొక జంట మాత్రం దానికి భిన్నంగా చేశారు. ఒకరిపై ఒకరికి ఉన్న కోపాన్ని అభంశుభం తెలియని చిన్నారులపై చూపించారు. వారికి చిత్రహింసలు పెట్టారు. చివరికి జైలు పాలయ్యారు. అసలు ఆ కథేంటి.? ఎక్కడ జరిగింది.? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న ఓ జంట తమ పిల్లలకు నరకయాతన చూపించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ చిన్నారులకు విముక్తి లభించింది. స్థానిక సమాచారం ప్రకారం.. ఆ పిల్లలు మనుషులే కాదు జంతువులు కూడా ఉండలేనటువంటి ప్రదేశంలో చాలా రోజుల నుంచి ఉన్నారు. వారు ఉంటున్న ఇంటి లోపల చచ్చిన ఎలుకలు, చెత్త చెదారం నిండి ఉంది. ఆ ప్రదేశం ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాంటిది చిన్నారులను అక్కడే ఉంచేశారు ఈ దయలేని భార్యాభర్తలు. ఇక ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఆ భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పులో నవంబర్‌లో రావాల్సి ఉంది. ఈ జంట కేసుకు సంబంధించిన విచారణ లివర్‌పూల్ క్రౌన్ కోర్టులో జరుగుతోంది.

అసలేం జరిగిందంటే.?

ఒకరోజు భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ తారస్థాయికి చేరింది. వాళ్ల ఇంటి చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఖాకీలు రంగంలోకి దిగారు. ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు. ఇల్లంతా కూడా ఓ మురికి కూపంలా ఉంది. ఎక్కడ చూసినా చెత్త చెదారం, చచ్చిన ఎలుకల కళేబరాలు.. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే, అక్కడి దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ భార్యాభర్తలకు ఆరుగురు పిల్లలు కాగా.. వారు అక్కడే చాలా రోజుల నుంచి ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల మానసిక, శారీరక పరిస్థితిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే వారిని అక్కడ నుంచి తరలించారు. చిన్నారులకు చిత్రహింసలు పెట్టడంతో ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. తమదైన శైలి వారిని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. నెల రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేయలేదని.. ఉద్యోగాల్లో తీరిక లేకపోవడంతో పిల్లలను కూడా పట్టించుకోప్లేదని దంపతులు తమ తప్పును ఒప్పుకున్నారు. ప్రస్తుతం వీరి కేసుపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. నవంబర్‌లో తుది తీర్పు రావాల్సి ఉంది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!