రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు!

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. తెలంగాణలో రెండు రోజులు(మంగళ, బుధవారాల్లో) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి

రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 5:12 PM

కోవిద్ 19 దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. తెలంగాణలో రెండు రోజులు(మంగళ, బుధవారాల్లో) ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రెండు రోజులు సాధారణం కంటే 2- 3 డిగ్రీలు ఎక్కువగాఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉందన్నారు.

కాగా.. ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌తో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ గుండె బద్దలయ్యేలా వార్త అందించింది. మిర్చి, పసుపు పంటలు చేతికొచ్చే సమయంలో వర్షం కురిస్తే రైతులు పంట మరింత నష్టపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు ప్రభావం ఉంటుందని వివరించారు వాతావరణ సంచాలకులు.