“రాజురా’లో దొంగల ముఠా..సోయా మాయం

“కాదేది దొంగతనానికి అనర్హం’ అన్నట్లుగా మారింది ప్రస్తుత కాలం. దొరికింది కాయా – పండా, గుండు పిన్నైనా సరే దొంగకు దొరికిందే మహద్భాగ్యం అన్న చందంగా..నిర్మల్‌ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కుబీర్‌ మండలంలోని రాజురా గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైతు ఇంటి ముందు నిల్వ ఉంచిన సోయా బస్తాలను దొంగిలించారు.. ఆరుగాలం కష్టించి పండించిన రైతు తన సోయా పంటను అమ్మకానికి సిద్ధంగా ఉంచాడు. బస్తాలలో నిల్వచేసి ఇంటిముందే ఉంచాడు. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన […]

రాజురా'లో దొంగల ముఠా..సోయా మాయం
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 09, 2019 | 1:36 PM

“కాదేది దొంగతనానికి అనర్హం’ అన్నట్లుగా మారింది ప్రస్తుత కాలం. దొరికింది కాయా – పండా, గుండు పిన్నైనా సరే దొంగకు దొరికిందే మహద్భాగ్యం అన్న చందంగా..నిర్మల్‌ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కుబీర్‌ మండలంలోని రాజురా గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైతు ఇంటి ముందు నిల్వ ఉంచిన సోయా బస్తాలను దొంగిలించారు.. ఆరుగాలం కష్టించి పండించిన రైతు తన సోయా పంటను అమ్మకానికి సిద్ధంగా ఉంచాడు. బస్తాలలో నిల్వచేసి ఇంటిముందే ఉంచాడు. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన కొందరు దుండగులు అందులోంచి 15 బస్తాల సోయాను ఎత్తుకెళ్లారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి సోయాసంచులు మాయంకావడంతో రైతు పిరాజీ ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు ఎత్తుకెళ్లిన సోయా విలువ సుమారుగా రూ. 40 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్‌ సహాయంతో దర్యాప్తు చేపట్టారు.