Andhra Pradesh: ఏపీలో రోడ్ల పరిస్థితిపై గతంలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇంకా చల్లారక ముందే ఆంధ్ర ప్రదేశ్లో విద్యుత్ సరఫరాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ కొందరిని కలసి తాను మాట్లాడానని, కరెంట్ సరఫరా గురించి వాళ్లు అన్న మాటలు విన్న తర్వాత తెలంగాణ ఎంతో నయమనే విషయం తనకు అర్థమైందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి హీట్ రాజేశాయి.
ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఏపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరిని కలిశానన్నారు. ఏపీలో కరెంట్ ఎంతసేపు ఉంటుందని, అనంతపురం, గుత్తి జిల్లాకు చెందిన వారిని అడిగానన్నారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కూడా కరెంట్ ఉండదని చెప్పారని ప్రస్తావించారు మంత్రి హరీష్ రావు. వారు అలా చెప్పడంతో తెలంగాణలోనే కరెంట్ బెటర్ అని వాళ్లతో చెప్పానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..