Telangana: మరోసారి తెలంగాణపై కుట్రలు.. ప్రధాని మోదీ కామెంట్స్పై మంత్రి ఎర్రబెల్లి ధ్వజం..
Telangana: తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ప్రధాని మోడి మరోసారి తెలంగాణపై కుట్రలకు తెరలేపారని రాష్ట్ర పంచాయతీరాజ్..
Telangana: తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ప్రధాని మోడి మరోసారి తెలంగాణపై కుట్రలకు తెరలేపారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ద్వజమెత్తారు. బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీశ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన నల్లజెండాలతో నిరసన తెలిపారు. బేషరతుగా ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ సాక్షిగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజం భగ్గుమనేలా చేశాయి. మోడీ వ్యాఖ్యలను నిరశిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ఖమ్మం- వరంగల్ మధ్య జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పాలకుర్తి, రాయపర్తి, తొర్రురు, దేవరుప్పుల మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 60 ఏళ్ల పోరాటం, వేలాది మంది త్యాగాలు, ఉద్యమనేత కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో, రాజ్యసభలో ఆమోదం పొందకుండా అడ్డుకునేందుకు ఎన్ని శక్తులు కుట్రలు చేసినా రాష్ట్ర విభజన జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. విభజన బిల్లులో పొందుపర్చిన విధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కేంద్రంలోని బీజేపి పార్టీ, ప్రధాని మోడీ అమలు చేయకుండా కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. కేంద్రం సహకారం లేకున్నా.. అభివృద్దిలో, పాలనలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పట్ల ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని హేళనచేస్తే ప్రజలు ఊరుకోరని, అలాంటి వారిని తరిమికొడతారని హెచ్చరించారు.
తెలంగాణ విభజనకు మీరు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయడం లేదా? అని బీజేపీని ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి. మీ వల్లే వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, బీజేపీ నాయకులకు తెలంగాణ పట్ల మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Also read:
Priyamani: కొంటె చూపులతో కవ్విస్తున్న కాటుకళ్ల చిన్నది.. ప్రియమణి లేటెస్ట్ ఇమేజెస్
Ashu Reddy: మైండ్ బ్లాక్ అందాలతో మాయ చేస్తున్న అషు లేటెస్ట్ పిక్స్
Alia Bhatt: అందాల ఆలియా పరువాలు చూడతరమా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్