Telangana Congress: షబ్బీర్‌ అలీపై లెటర్‌ వార్‌ స్టార్ట్‌ చేసిన కోమటిరెడ్డి.. టీకాంగ్రెస్‌లో ఆగని లొల్లి..

|

Sep 23, 2022 | 9:19 AM

Komatireddy Venkat Reddy: టి.కాంగ్రెస్‌లో లొల్లి కంటిన్యూ అవుతోంది. టీకప్పులో తుఫాన్‌లా చెలరేగుతూనే ఉంది. కొత్తగా షబ్బీర్‌ అలీపై లెటర్‌ వార్‌ స్టార్ట్‌ చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇంతకీ ఆయన చేసిన ఫిర్యాదేంటి? షబ్బీర్‌ అలీనే ఆయన ఎందుకు టార్గెట్‌ చేశారు?

Telangana Congress: షబ్బీర్‌ అలీపై లెటర్‌ వార్‌ స్టార్ట్‌ చేసిన కోమటిరెడ్డి.. టీకాంగ్రెస్‌లో ఆగని లొల్లి..
Komatireddy Venkat Reddy
Follow us on

Shabbir Ali: మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. నేతల మధ్య కోల్డ్‌ వార్‌ నివురు గప్పిన నిప్పులా మారింది. తాజాగా పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో కలకలం రేపారు. ఇప్పుడ ఆయన రాసిన లేఖ ఢిల్లీ స్థాయిలో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని టార్గెట్‌గా చేసుకుని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ప్రియాంక గాంధీకి లేఖను పంపారు. పార్టీ నుంచి వెంటనే షబ్బీర్‌ అలీని సస్పెండ్‌ చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

షబ్బీర్‌ అలీకి చీటింగ్‌, ఇతర కేసుల్లో ప్రమేయం ఉందని, ఆయన ఎప్పుడైనా అరెస్టు కావొచ్చని ఆ లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలను పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నానని, అందుకే ఈ లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలో సీనియర్ సభ్యుడిగా, ప్రస్తుత ఎంపీగా కోరుతున్నానని, పార్టీ క్రమశిక్షణా చర్య కమిటీ నుండి ఆయనకు షోకాజ్ నోటీసు పంపాలని కోమటిరెడ్డి సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని జత చేసి ప్రియాంక గాంధీకి లేఖను పంపారు. షబ్బీర్‌ అలీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు కేరళలో జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు. ఆయనతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. నడుస్తూనే రాహుల్‌తో పలు అంశాలపై వెంకట్‌రెడ్డి చర్చించారు.