Telangana: ఇల్లు, డబ్బు తీసుకుని కన్న తల్లిని గెంటేసిన కన్నబిడ్డలు.. ఆ తర్వాత ఏం జరిగింది ?

| Edited By: Balaraju Goud

Aug 27, 2024 | 3:09 PM

పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డలు కన్నతల్లికి బుక్కెడన్నం పెట్టడం లేదు. ఆస్తుల పంచుకునే వరకు వారసులం. కానీ అమ్మను చూసుకునేందుకు కాదని అంటున్నారు. గుడిసెలో ఉంటున్న తన గురించి పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.

Telangana: ఇల్లు, డబ్బు తీసుకుని కన్న తల్లిని గెంటేసిన కన్నబిడ్డలు.. ఆ తర్వాత ఏం జరిగింది ?
Old Woman
Follow us on

పేగు బంధం తెంచుకుని పుట్టిన బిడ్డలు కన్నతల్లికి బుక్కెడన్నం పెట్టడం లేదు. ఆస్తుల పంచుకునే వరకు వారసులం. కానీ అమ్మను చూసుకునేందుకు కాదని అంటున్నారు. గుడిసెలో ఉంటున్న తన గురించి పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నరసవ్వ దీనస్థితి దారుణంగా తయారైంది. కడుపున పుట్టిన నలుగురు కొడుకులను ఓ ఇంటి వాళ్లను చేసి, ఆస్తుల పంపకాలు చేసి ప్రయోజకులను చేసింది నరసవ్వ. అయితే వృద్దాప్యానికి చేరుకున్న ఆమె ఓ చిన్న గుడిసెలో తల దాచుకుంటూ జీవనం సాగిస్తోంది. చేతులు వణుకుతూ… ఊత కర్ర సాయంతో నడుస్తున్న తనకు కన్నబిడ్డలు అన్నం కూడా పెట్టడం లేదని వాపోయింది. తన పట్ల వివక్ష చూపుతున్న బిడ్డలను పిలిచి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది నరసవ్వ. ఎల్ఎండీ ఎస్సై చేరాలను కలిసిన నరసవ్వ తన గోడు వెల్లబోసుకుంది. దీంతో ఆమెకు బాసటగా నిలిస్తామని హామీ ఇచ్చారు పోలీసులు. తల్లి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం సరికాదని వారికి నచ్చచెప్తామని ఎస్సై, నరసవ్వకు మాట ఇచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..