Telangana: పోలింగ్ డే వెదర్ రిపోర్ట్ ఇదే.. పార్టీ నేతలు, ఎన్నికల అధికారుల్లో ఆందోళన..
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందో అన్న అసక్తి అంతట కనిపిస్తోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో పాల్గొంటున్నారు. దాదాపు 525 మంది అభ్యర్థులు 17 పార్లమెంట్ ఎన్నికల్లో తమ భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ సమ్మర్ కావడంతో వాతావరణం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని.. ఇది పోలింగ్పై ప్రభావం చూపుతుందని అధికారులు, అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందో అన్న అసక్తి అంతట కనిపిస్తోంది. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో పాల్గొంటున్నారు. దాదాపు 525 మంది అభ్యర్థులు 17 పార్లమెంట్ ఎన్నికల్లో తమ భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ సమ్మర్ కావడంతో వాతావరణం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని.. ఇది పోలింగ్పై ప్రభావం చూపుతుందని అధికారులు, అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
సమ్మర్ ఎఫెక్ట్ పోలింగ్పై పడకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు, టెంట్, కుర్చీలు, ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట సేద తీరడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు రాజకీయ పార్టీల వినతి మేరకు పోలింగ్ సమయాన్ని కూడా పెంచింది ఎన్నికల కమిషన్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మినహా రాష్ట్రం మొత్తం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎండ ప్రభావంతో బయటకి రాలేని వారు సాయంత్రం ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేస్తారని ఆశిస్తుంది ఈసీ.
ఇదంతా బాగున్న వాతావరణం పూర్తిస్థాయిలో డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ మధ్యే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అయింది. సిటీలో ఎక్కువగా 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 3,4 రోజులు ఈదురు గాలుల ప్రభావం ఉంటుంది అని వెదర్ రిపోర్ట్ చెబుతుంది. వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి.. అక్కడక్కడ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. పోలింగ్ డే రోజు మాత్రం పొడి వాతావరణంతో సాయంత్రానికి చల్లటి గాలులతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వేడి ప్రభావం ఎక్కువగా ఉంది అని ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. వాతావరణంలో మార్పులతో ఏమౌతుందో అన్న ఆలోచనలో పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..