News Watch: లిక్కర్ స్కాంలో నెక్ట్స్ అరెస్ట్ ఎవరు? ప్రధాని విశాఖ టూర్లో నిరసనలు తప్పవా…?
ఏపీ, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం.. తాజా సమాచారలు ,వివరాలు, ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం...
- పశ్చిమగోదావరి జిల్లాలో ఊహించని ఘటన జరిగింది. తాడేపల్లిగూడెం దగ్గర్లో కడియద్ద గ్రామ శివార్లలో బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కూలీల బతుకులు బుగ్గిపాలయ్యాయి. మరొకరు చావు బతుకులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్లు, కస్టడీలు కొనసాగుతుంటే మరోవైపు అదే ఈడీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సీఈఓ చందన్. సెప్టెంబర్ 16న ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చి సోదాలు చేశారని, కొన్ని వస్తువులు, డాక్యుమెంట్స్ తీసుకెళ్లారని చెప్పారు. తనిఖీలు చేసిన రోజే తనను ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లి కొందరు వ్యాపారుల లిస్ట్ తీసుకున్నారని ఆరోపించారు. విచారణ పేరు చెప్పి తనను గాయపరిచారని భారీ ఫిర్యాదే చేశారు. ఈడీ కారణంగా తన కుడి చెవికి గాయమైందన్న చందన్.. దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తనకు తెలియని ప్రశ్నలు వేసి.. పదేపదే ఇబ్బందిపెట్టారన్నారు. లిక్కర్ స్కామ్లో శరత్చంద్రారెడ్డి పేరు చెప్పేలా తనపై ఈడీ తీవ్ర ఒత్తిడి చేసిందన్న చందన్ కంప్లైంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
- ఏపీలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. రెండు రోజులు పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 7గంటల 30నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు ప్రధాని మోదీ. ఎయిర్ పోర్ట్లో భారత ప్రధానికి.. ఏపీ సీఎం జగన్ స్వాగతం పలుకుతారని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి. తర్వాత బీజేపీ కార్యకర్తల ర్యాలీ ద్వారా బస చేసే హోటల్కు ప్రధాని చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం ఆంధ్రయూనివర్శిటీ ఏర్పాటు చేసిన సభలో ప్రధానితో పాటు సీఎం జగన్ పాల్గొంటారు. ఇలాంటి టాప్ వార్తలను నేటి న్యూస్ వాచ్లో చూద్దాం పదండి
Latest Videos
Latest News