Congress: ‘6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించలేదు’.. కాంగ్రెస్ మంత్రులకు హరీష్ రావు కౌంటర్..
కేసీఆర్పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు హరీష్ రావు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయన్ను తిడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.
కేసీఆర్పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు హరీష్ రావు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయన్ను తిడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారన్నారు. రాహుల్ గాంధీ ఏమో తన మ్యానిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని అంటారు.. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి తీసుకుంటాం అని అంటున్నారు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల త్వరత మళ్ళీ అధికారంలోకి రాదు అని, అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచినా కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రానే రాదని జోస్యం చెప్పారు మంత్రి హరీష్ రావు.
మీరు ఎన్ని చేస్తారో చేయండి.. మేము వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తాము అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులు ఏం చేసినా ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మడం లేదని బాండ్ పేపర్లు రాసి ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారన్నారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని, రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారని కానీ ఏ ఒక్కటీ చేయలేదన్నారు. రుణమాఫీ అయి ఉంటే కాంగ్రెస్ కు ఓటు వేయమని, కాకపోతే బీఆర్ఎస్ కు ఓటు వేయమని కోరారు హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయ్యిందని తెలిపారు. రైతులకు సాగునీరు, రైతు బంధు రావడంలేదని విమర్శించారు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ లీడర్లను కొంటున్నారని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…