Terrific: ఉదయాన్నే నిద్రలేచి తలుపులు తీసిన వ్యక్తి.. కళ్లముందు సాక్షాత్కరించిన భీకర దృశ్యం.. దెబ్బకు..

|

Sep 01, 2022 | 6:37 PM

Terrific Scene: ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైనా సరే దేవుడి పటం గానీ, ఇంట్లో తమకు ఇష్టమైన వారి మొహాన్ని చూస్తాం. అలా కాకుండా ఉదయం లేచీ లేవగానే..

Terrific: ఉదయాన్నే నిద్రలేచి తలుపులు తీసిన వ్యక్తి.. కళ్లముందు సాక్షాత్కరించిన భీకర దృశ్యం.. దెబ్బకు..
Doors Open
Follow us on

Terrific Scene: ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైనా సరే దేవుడి పటం గానీ, ఇంట్లో తమకు ఇష్టమైన వారి మొహాన్ని చూస్తాం. అలా కాకుండా ఉదయం లేచీ లేవగానే.. నిద్ర మత్తులో భీకర దృశ్యం, భయానక దృశ్యం కనిపిస్తే పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఇక్కడ కొందరు వ్యక్తులు అలాంటి హఠాత్ పరిణామాన్ని ఎదుర్కొన్నారు. కనిపించిన దృశ్యం చూసి భీతిళ్లిపోయారు. బాబోయ్ అంటూ లబోదిబోమన్నారు. ఈ ఘటన ఇప్పుడు ఆ ఊరంతా భయాందోళనలు రేకెత్తిస్తుంది.

తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంభూరు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గ్రామంలోని శివ గంగ వాటర్ ప్లాంట్ వద్ద కొందరు దుండగులు అర్ధరాత్రి పసుపు కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలతో ముగ్గులు వేశారు. ఇక ఉదయాన్నే నిద్రలేచిన వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఆ ముగ్గులు చూసి షాక్ కు గురయ్యారు. ఎవరో చేత బడి చేస్తున్నారని, గతంలో కూడా ఇలాగే చేశారని నిర్వాహకులు వాపోతున్నారు. చిన్న పిల్లలతో ఉంటున్నామని, ఇట్లాంటి క్షుద్ర పూజలతో నిత్యం టేన్షన్‌తో జీవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం ఇది ఖచ్చితంగా ఆకతాయిల పనులే అయి ఉంటాయని అంటున్నారు. నిన్న రాత్రి వినాయక చవితి కావడంతో సహజంగా గ్రామాలలో ఆకతాయిలు చవితి రోజు వేరే వాళ్ళ ఇండ్ల ముందు అల్లరి పనులు చేసి తిట్లు తింటుతుంటారని, అలానే కొందరు ఆకతాయిలు ఇలాంటి పని చేసుంటారని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన సదరు ఇంటి వ్యక్తులను హడలెత్తించింది.

ఇవి కూడా చదవండి

Black Magic

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..