Revanth Reddy: ‘అప్పుడే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు’.. సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
UPSC తరహాలో TGPSCలో మార్పులు చేశామని.. వెంట వెంటనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్లో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ చైర్మన్ అంగీకరించారని తెలిపారు. అంతకుముందు రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
UPSC తరహాలో TGPSCలో మార్పులు చేశామని.. వెంట వెంటనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్లో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ చైర్మన్ అంగీకరించారని తెలిపారు. అంతకుముందు రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తల్లిదండ్రుల, రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసి.. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఆర్థిక సాయం అందించడం ఇదే తొలిసారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెయిన్స్ కు ప్రిపేర్ కావడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. ఇది చారిత్రాత్మక నిర్ణయం.. అంతా మెయిన్స్ కు ఎంపిక కావాలి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలని ఆశిస్తున్నామన్నారు. మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు.
నిరుద్యోగుల బాధలు తమకు తెలుసని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని.. అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణ బిడ్డలు జాతీయస్థాయి అవకాశాలపైనా ఫోకస్ పెట్టాలని రేవంత్ రోరారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..