Telangana: నోటిఫికేషన్‌కు ముందే బీజేపీ 10 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం..

|

Feb 12, 2024 | 10:37 AM

ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ 10 లోక్‌ సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్‌ ఎంపీలనే కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఈ ముగ్గురితో పాటు మరో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఆమోదం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపినట్లు సమాచారం.

Telangana: నోటిఫికేషన్‌కు ముందే బీజేపీ 10 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం..
Telangana BJP
Follow us on

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ 10 లోక్‌ సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్‌ ఎంపీలనే కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఈ ముగ్గురితో పాటు మరో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఆమోదం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపినట్లు సమాచారం.

ఎన్నికల సంఘం ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అందుకే బీజేపీ నాయకత్వం కనీసం 10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా నోటిఫికేషన్ విడుదలకు ముందే తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. చేవెళ్ల, భువనగిరి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల నుంచి ఇద్దరి పేర్లను రాష్ట్ర నాయకత్వం ఆమోదం కోసం పార్టీ హైకమాండ్‌కు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్కాజిగిరి, జహీరాబాద్ టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రేసులో ఉన్నారని, అందుకే ఈ రెండు స్థానాలను పెండింగ్‌లో ఉంచామని చెబుతున్నారు బీజేపీ నేతలు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి మురళీధర్ రావు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అయితే ఈటెలను మెదక్ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరుతోంది. అందుకు ఆయన సిద్ధంగా లేరని సమాచారం. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు మెదక్‌ నుంచి పోటీ చేయాలని కోరుతూ గత కొంతకాలంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టడంతో పాటు కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. బాపురావు అభ్యర్థిత్వాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా స్థానిక నాయకులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికే తమ నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలియజేశారని స్థానిక బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సులువుగా గెలిచే అభ్యర్థి కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ స్థానాల్లో బీజేపీ బలహీనంగా ఉండడంతో ఈ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థుల కోసం ఆరా తీస్తోంది. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్‌లోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో పార్టీ ఉంది. 17 సీట్లలో మున్నూరు కాపు, గౌడ్, ముదిరాజ్, యాదవ సామాజికవర్గాలతో సహా వెనుకబడిన కులాలకు ఐదు సీట్లు ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. మూడు స్థానాలను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 10 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ తెలంగాణ యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 సీట్లు గెలుచుకోవడంతోపాటు 14 శాతం ఓట్లను సాధించింది. ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ కాస్త ఓటు బ్యాంకును పెంచుకుని 8-10 లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..