ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వ హెచ్చరిక
ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేటు హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స ఫీజులపై మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు..
ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేటు హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స ఫీజులపై మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే చికిత్సకు తీసుకోవాలని పేర్కొంది. ఫీజుల వివరాలను ఆస్పత్రిలో కీలక ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని సూచించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే చికిత్సకు తీసుకోవాలి. కోవిడ్ చికిత్సకు వినియోగించే మందులకు ఎంఆర్పీ ధరలను, పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను సైతం ఆస్పత్రిలో ప్రదర్శించాలని సూచించింది. రోగులను డిశ్చార్జి చేసే సమయంలో సమగ్ర వివరాలతో బిల్లు ఇవ్వాలని వెల్లడించింది ప్రభుత్వం. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
కాగా ప్రస్తుతం తెలంగాణలో మంగళవారం (11వ తేదీన) 1,897 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 84,544కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 654కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,65,847 కరోనా టెస్టులు చేశారు. నిన్న ఒక్క రోజే 22,972 టెస్టులు చేశారు. జిహెచ్ఎంసిలో నిన్న 479 కేసులు నమోదయ్యాయి. దీంతో జిహెచ్ఎంసిలో మొత్తం కేసుల సంఖ్య43,858కు చేరుకుంది. 22,596 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 61,294కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1920 మంది డిశ్చార్చి అయ్యారు.
Read More:
పనికి రావడం లేదని 12 ఏళ్ల బాలుడిని చావగొట్టిన యజమాని
కరోనా నుంచి కోలుకున్న డైరెక్టర్ రాజమౌళి కుటుంబం
దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు, కర్నాటకకి ఎల్లో అలెర్ట్