అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ సంచలన నిర్ణయం

జూన్ 16వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 16, 17 తేదీలలో కేవలం రెండు రోజుల పాటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే...

అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ సంచలన నిర్ణయం
Follow us

|

Updated on: Jun 15, 2020 | 3:11 PM

జూన్ 16వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 16, 17 తేదీలలో కేవలం రెండు రోజుల పాటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే, రాష్ట్రంలో నెలకొన్న లాక్ డౌన్, కరోనా విజృంభణలకు రాజకీయ ప్రకంపనలు కూడా జత కావడంతో అసెంబ్లీ సమావేశాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ తరుణంలో చంద్రబాబు నేత‌ృత్వంలో సోమవారం సమావేశమైన టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది.

రెండ్రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని భావిస్తున్నట్లుగా కథనాలు వచ్చాయి. అయితే సోమవారం సమావేశమైన తెలుగుదేశం పార్టీ నేతలు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అక్రమ అరెస్టులు, ఇసుక మాఫియా, మద్యం ధరలు, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. తమ పార్టీ నేతల అరెస్టులపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు టీడీపీ నేతలు. మరోవైపు జూన్ 16వ తేదీన ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలుత గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఆ తర్వాత వెనువెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి… మధ్యాహ్నం సెషన్‌లో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ఆ వెంటనే బడ్జెట్‌పై స్వల్ప వ్యవధిలో చర్చను ముగించి.. సభ ఆమోదం తీసుకుంటారు. తిరిగి మంగళవారం సమావేశమయ్యే ఏపీ అసెంబ్లీ… కొన్ని కీలక బిల్లులను ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.

తాజాగా రెండ్రోజుల సభలో పలు కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష టీడీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సభలో కార్యకలాపాలు అధికార పక్షం అనుకున్నంత వేగంగా, అదే షెడ్యూల్‌లో జరుగుతాయా అన్న సందేహాలు మొదలయ్యాయి. విపక్ష టీడీపీ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ కూడా ప్రతివ్యూహంతో రెడీ అవుతున్నట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Latest Articles
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!