మోదీ, అమిత్‌షాల గురించి.. స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ప్రాణగండం ఉందన్నారు. ఇద్దరిని హతామార్చేందుకు ఉగ్రకుట్ర జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఇద్దరి విషయంపై ఓ మదర్సాలో చర్చ జరిగిందన్నారు. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు తక్షణమే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఒక మసీదులో ముళ్ల ఓ గ్రూప్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఈ ప్రాణగండం విషయం బయటకు […]

మోదీ, అమిత్‌షాల గురించి.. స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 24, 2020 | 6:34 AM

శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ప్రాణగండం ఉందన్నారు. ఇద్దరిని హతామార్చేందుకు ఉగ్రకుట్ర జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఇద్దరి విషయంపై ఓ మదర్సాలో చర్చ జరిగిందన్నారు. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు తక్షణమే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఒక మసీదులో ముళ్ల ఓ గ్రూప్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఈ ప్రాణగండం విషయం బయటకు వచ్చిందన్నారు.

ఇక పిఠాపురం విగ్రహ ధ్వంసం ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మార్చి 1న పిఠాపురంలో 30 వేల మందితో సహస్ర కలశాభిషేకం చేయబోతున్నట్లు ప్రకటించారు. అప్పటీకీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే.. ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా అంబేద్కర్‌ విషయంలో కూడా పరిపూర్ణానంద పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందువు అంబేద్కర్‌ను గుండెల్లో పెట్టుకుని పూజించాలన్న స్వామీజీ.. అంబేద్కర్‌కు సంబంధించి గంట నిడివిగల చిత్రాన్ని తీయబోతున్నట్లు స్వామి పరిపూర్ణానంద తెలిపారు.