గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సుధీర్ బాబు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్టార్ట్ చేేసిన  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందిలో స్పూర్తి నింపి కొత్త ఆలోచనలకు తెరలేపుతుంది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సుధీర్ బాబు
Follow us

|

Updated on: Sep 09, 2020 | 4:22 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్టార్ట్ చేేసిన  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందిలో స్పూర్తి నింపి కొత్త ఆలోచనలకు తెరలేపుతుంది. హీరో నవీన్ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హీరో సుధీర్ బాబు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాలో కొత్త ఆలోచనలు తీసుకువస్తుంది. ఈ నాటిన మొక్కకు ఓ  ప్రత్యేకత ఉంది.  నూతనంగా విడుదల అయిన నా ‘వి’ సినిమాకు గుర్తుగా మొక్కలు నాటాను. ఇకపై నేను నా ప్రతి సినిమా విడుదలకు ముందు మొక్కను నాటి ఆ మొక్కకు ఆ సినిమా పేరు పెట్టుకుంటాను. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతున్నపుడు దాని ముందు మొక్కలను నాటి వాటికి పేర్లు పెట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మా పిల్లలకు కూడా నేను ఇదే నేర్పిస్తాను అని పేర్కొన్నారు సుధీర్ బాబు.

కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం  తన  ‘వి’ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరోయిన్లు నివేదిత థామస్, అదితి రావు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సుధీర్ బాబు.

Also Read :

రాయలసీమ, దక్షిణ కోస్తాలకు భారీ వర్ష సూచన !

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్