AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics: అందరి చూపు లక్ష్య సేన్, లోవ్లినా బోర్గోహైన్‌లపైనే.. 9వ రోజు భారత్ షెడ్యూల్ ఇదే..

Paris Olympics 2024, Day 9, Schedule: పారిస్ ఒలింపిక్స్‌లో 8 రోజుల ఆట ముగిసింది. ఈక్రమంలో భారత్ 3 పతకాలు సాధించి పతకాల పట్టికలో 50వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ క్రీడలు 9వ రోజు వంతు వచ్చింది. ఇక్కడ అందరి దృష్టి భారత హాకీ జట్టు లక్ష్య సేన్, లోవ్లినా బోర్గోహైన్‌లపైనే ఉంటుంది.

Paris Olympics: అందరి చూపు లక్ష్య సేన్, లోవ్లినా బోర్గోహైన్‌లపైనే.. 9వ రోజు భారత్ షెడ్యూల్ ఇదే..
Paris Olympics 2024, Day 9,
Venkata Chari
|

Updated on: Aug 04, 2024 | 6:26 AM

Share

Paris Olympics 2024, Day 9, Schedule: పారిస్ ఒలింపిక్స్ 2024లో 8 రోజుల ఆట తర్వాత, భారత్ 3 పతకాలతో 50వ స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు రోజు భారత్ 47వ ర్యాంక్‌లో ఉండగా, రెండు రోజులుగా ఎలాంటి పతకం సాధించకపోవడంతో భారీగా నష్టపోయింది. ఇప్పుడు ఈ క్రీడలు మరో 8 రోజుల పాటు జరగనున్నాయి. గత రెండు రోజుల్లో భారత అథ్లెట్లు 5 పతక అవకాశాలను కోల్పోయారు. 8వ రోజు ఆటలో మను భాకర్ హ్యాట్రిక్ మిస్సయింది. దీపికా కుమారి, భజన్ కౌర్ కూడా ఆర్చరీలో పతక రౌండ్‌కు చేరుకోలేకపోయారు. ఇది కాకుండా, నిశాంత్ దేవ్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పుడు 9వ రోజు లక్ష్య సేన్, లోవ్లినా బోర్గోహైన్ వంటి కీలక పేర్లు ఈ రోజున సందడి చేయనున్నాయి. షూటింగ్‌లో మరోసారి పతకం సాధించే అవకాశం ఉంటుంది.

భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్..

పారిస్ ఒలింపిక్స్ 9వ రోజు అతిపెద్ద మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాను ఓడించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్‌తో తలపడనున్న క్వార్టర్ ఫైనల్స్ వంతు వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా బ్రిటన్ భారత్‌ను ఓడించింది. ఆగస్టు 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత జట్టు గెలుపొందాలనే సంకల్పంతో మరోసారి రంగంలోకి దిగనుంది.

లక్ష్య సేన్‌కి కష్టాలు..

9వ రోజు భారత్‌కు రెండో భారీ మ్యాచ్ బ్యాడ్మింటన్‌లో జరగనుంది. పతకం సాధించి చరిత్ర సృష్టించేందుకు లక్ష్య సేన్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. దీనికి ముందు, అతను పురుషుల బ్యాడ్మింటన్ సెమీ-ఫైనల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సన్‌తో పోటీపడాల్సి ఉంటుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అక్సెల్‌సెన్ రెండో స్థానంలో ఉండగా, లక్ష్య 19వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య గెలిస్తే ఫైనల్‌కు చేరడంతోపాటు పతకం కూడా ఖాయం. పురుషుల బ్యాడ్మింటన్‌ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.20 గంటల నుంచి జరగనుంది.

ఇవి కూడా చదవండి

లోవ్లినా పతకంపై కళ్లు..

ఇప్పుడు బాక్సింగ్‌లో లోవ్లినా బోర్గోహైన్ భారత్‌కు చివరి ఆశ. ఆదివారం ఆగస్టు 4న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన లి కియాన్‌తో తలపడాల్సి ఉంది. లి కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం, రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించినందున ఈ మ్యాచ్ అంత సులభం కాదు. అయితే, కియాన్‌ను ఓడించడంలో లోవ్లినా విజయం సాధిస్తే, ఆమె సెమీ-ఫైనల్‌కు వెళ్లి, కనీసం కాంస్య పతకాన్ని ఆమె పేరు మీద ఖాయం చేస్తుంది.

షూటింగ్‌లోనూ పతకం సాధించే అవకాశం..

పారిస్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌ ఇప్పటికే 3 పతకాలు సాధించింది. ఇప్పుడు 9వ రోజు మరో పతకం సాధించే అవకాశం ఉంది. మహిళల స్కీట్ షూటింగ్ ఈవెంట్‌లో ఆగస్టు 4 రెండో రోజు. ఇందులో భారత్ తరపున రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ పాల్గొంటున్నారు. మొదటి రోజు తర్వాత మహేశ్వరి 8వ స్థానంలో, రైజా 25వ స్థానంలో ఉన్నారు. అర్హత కోసం మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు మొదలుకానుంది. షూటర్లిద్దరూ టాప్-6లో చేరితే రాత్రి 7 గంటల నుంచి జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పతకాలు సాధించవచ్చు.

భారత్ ఇతర మ్యాచ్‌లు..

పురుషుల షూటింగ్ 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ స్టేజ్ పోటీ 12.30 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో భారతదేశం నుంచి అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ పాల్గొంటున్నారు. గోల్ఫ్ నాలుగో రౌండ్‌లో శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ కనిపించనున్నారు. పారుల్ చౌదరి అథ్లెటిక్స్‌లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మొదటి రౌండ్‌లో అర్హత కోసం పరిగెత్తనుంది. ఇక జాసన్ ఆల్డ్రిన్ పురుషుల లాంగ్ జంప్‌లో పాల్గొననున్నాడు. సెయిలింగ్‌లో విష్ణు శరవణన్, నేత్ర కుమనన్ 7, 8 స్థానాలకు పోటీ పడనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us