రాజధాని న్యూఢిల్లీలో బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 (Birmingham CWG 2022) కోసం ట్రయల్స్ నిర్వహిస్తు్న్నారు. కేడీ జాదవ్ స్టేడియంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) నిర్వహిస్తున్న ట్రయల్స్లో మంగళవారం పురుష రెజ్లర్లు పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో ఓ వివాదం జరగడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ ట్రయల్స్లో 125 కేజీల విభాగంలో రెజ్లర్ సతేందర్ మాలిక్, ఒక సీనియర్ రిఫరీతో అనుచితంగా ప్రవర్తించాడు. మ్యాచ్ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా రావడంతో అతనిని కొట్టాడు. ఈ చర్యతో రెజ్లింగ్ సమాఖ్య కూడా చాలా షాక్ అయ్యింది. సమాఖ్య వెంటనే గట్టి చర్య తీసుకుంది. సతేందర్ను జీవితకాలం నిషేధించింది.
Also Read: World Boxing Championship: నిరాశ పరిచిన ఐదుగురు.. పతకాలు ఖాయం చేసిన ముగ్గురు భారత మహిళా బాక్సర్లు..
Thomas Cup 2022: థామస్ కప్లో తొలి విజయం.. ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఆ ఐదుగురు..