ఫేస్ యాప్ ఛాలెంజ్… సోషల్ మీడియాలో నయా ట్రెండ్!

|

Jul 18, 2019 | 5:07 PM

‘ఫేస్ యాప్’ ఛాలెంజ్… కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సరికొత్త ఛాలెంజ్. సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు అందరూ కూడా వృద్దాప్యంలో ఎలా ఉంటారో వారివారీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక నెటిజన్ టీమిండియా క్రికెటర్లు 2053 వరల్డ్‌కప్‌కు ఇలా ఉండబోతున్నారంటూ పోస్ట్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ధోని, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ […]

ఫేస్ యాప్ ఛాలెంజ్... సోషల్ మీడియాలో నయా ట్రెండ్!
Follow us on

‘ఫేస్ యాప్’ ఛాలెంజ్… కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సరికొత్త ఛాలెంజ్. సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు అందరూ కూడా వృద్దాప్యంలో ఎలా ఉంటారో వారివారీ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక నెటిజన్ టీమిండియా క్రికెటర్లు 2053 వరల్డ్‌కప్‌కు ఇలా ఉండబోతున్నారంటూ పోస్ట్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ధోని, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తదితరులు వృద్ధాప్యంలోనూ భిన్నంగా ఉన్నారు. అటు దాయాది పాకిస్థాన్ జట్టు ఫోటోను కూడా ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అది కూడా వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌తో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్.. ఆగష్టు 3 నుంచి విండీస్ పర్యటనకు సన్నద్ధం అవుతోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.