IND vs NZ: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసి 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా చూపిన ఆటతీరు.. ఈ మ్యాచ్లో కనిపించలేదు. ఈ పరాజయంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే రోహిత్ శర్మ సేనకు ఈ సిరీస్ గెలిచే అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే, ఈ సిరీస్లో ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి.
కాగా, సిరీస్లో రెండో మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమిండియా జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. పవర్ ఫుల్ ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు మ్యాచ్ల కోసం జట్టులో చేరాడు. ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు సుందర్ రాకతో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 నుంచి ఏ ఆటగాడు తప్పుకుంటాడో చూడాలి. సుందర్ రాక కారణంగా ప్లేయింగ్ 11 నుంచి తప్పుకున్న ముగ్గురు ఆటగాళ్లను ఇక్కడ తెలుసుకుందాం..
ఈ జాబితాలో టీమిండియా ప్రధాన స్పిన్నర్గా గుర్తింపు పొందిన కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే, బెంగళూరు టెస్టులో అతని స్పిన్ మ్యాజిక్ కనిపించలేదు. కివీస్ బ్యాట్స్మెన్లు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఈజీగా పరుగులు సాధించారు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 3 వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. అతని స్థానంలో సుందర్ తీసుకునే అవకాశం ఉంది.
వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బెంగళూరు టెస్టులో ఘోరంగా ఓడిపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు. జడేజా రెండు ఇన్నింగ్స్ల్లోనూ 5 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో బౌలింగ్లో అతని ఖాతాలో 3 వికెట్లు వచ్చాయి. జడేజా నుంచి ఈ తరహా ప్రదర్శనను భారత అభిమానులు ఊహించలేదు. సుందర్ అతని స్థానంలో ఇండియా ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం ఉంది.
బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ కేఎల్ రాహుల్ బ్యాట్ నిశబ్దంగా ఉంది. అతను తన బ్యాడ్ ఫామ్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. దాని కారణంగా జట్టు కూడా తీవ్ర పరిణామాలను చవిచూస్తోంది. ఇటువంటి పరిస్థితిలో, సిరీస్లోని మిగిలిన మ్యాచ్లకు 11 మందిలో రాహుల్ తన స్థానాన్ని దక్కించుకోవడం చాలా కష్టమని తెలుస్తోంది. సుందర్ ఇటీవలి ఫామ్ అద్భుతంగా ఉంది. రాహుల్ను భర్తీ చేయగలడని అంతా భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..