IND vs SA Final: ఫైనల్ కోసం ఆటను దాచి పెట్టాడు.. కోహ్లీకి మద్దతుగా రోహిత్ కీలక వ్యాఖ్యలు..

|

Jun 28, 2024 | 10:49 AM

T20 World Cup 2024: ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఓపెనర్‌గా ఆడుతున్న విరాట్ కోహ్లీ 7 ఇన్నింగ్స్‌ల్లో 75 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఓపెనర్‌గా ఆడుతుండగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బెంచ్‌పైనే ఉన్నాడు. అయితే, విరాట్ కోహ్లీ ఆటకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికాడు.

IND vs SA Final: ఫైనల్ కోసం ఆటను దాచి పెట్టాడు.. కోహ్లీకి మద్దతుగా రోహిత్ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma Virat Kohli 1
Follow us on

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో 2వ సెమీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (57) టీమిండియా తరుపున హాఫ్ సెంచరీ చేయగా, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

ఈ విజయం తర్వాత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా విజయానికి టీమ్ ఎఫర్టే ప్రధాన కారణం. ఇక్కడ అందరూ బాగా సహకరించారు. మేం పరిస్థితులకు బాగా అలవాటు పడ్డామని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఎందుకంటే, ఈ పిచ్ కాస్త ఛాలెంజింగ్‌గా ఉంది. ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం కాస్త కష్టమైంది. పరిస్థితికి అనుగుణంగా ఆడాం. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ పరిస్థితులకు అనుగుణంగా ఆడితే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుందని రోహిత్ శర్మ అన్నాడు.

ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టమని, ఒక దశలో 140-150 పరుగులు చేస్తే సరిపోతుందని భావించామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. నాకు, సూర్యకి బాగా కలిసొచ్చింది. అయితే, ఆ తర్వాత మరిన్ని పరుగులు రావాలని భావించాను.

దీని గురించి నేను ఎవరికీ తెలియజేయలేదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ తమ ఆటను ఆడుకుంటారు. కాబట్టి, వాళ్లంతా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నాను. అయితే, 150 పరుగుల మార్కును దాటాలని నా మనసులో అనుకున్నాను.

కాబట్టి, మేం 170 పరుగులు చేసినప్పుడు, ఈ పిచ్‌పై ఇది మంచి స్కోర్ అని నేను అనుకున్నాను. ఆ తర్వాత మన బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశారు. ఈ విజయంలో ఘనత మన స్పిన్నర్లకే దక్కుతుందని రోహిత్ శర్మ అన్నాడు.

విరాట్ కోహ్లి క్లాస్ ప్లేయర్..

ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన గురించి అడిగిన ప్రశ్నకు, రోహిత్ శర్మ అతను (కోహ్లీ) నాణ్యమైన ఆటగాడు అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీకి ఫామ్ ఎప్పుడూ సమస్య కాదు. 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫామ్ ఎప్పుడూ సమస్య కాదు.

బహుశా విరాట్ కోహ్లి తన ఆటను ఫైనల్‌కు కాపాడుకుంటున్నాడని నేను అనుమానిస్తున్నాను. కాబట్టి, ఫైనల్ బాగా ఆడతాడన్న నమ్మకం ఉంది. దీని గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..