Team India: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే! కోచ్ గంభీర్ సూచనతో..

|

Jul 18, 2024 | 9:59 AM

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశంగా మారింది. క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటివరకు హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే యంగ్ ప్లేయర్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే గంభీర్ ప్రతిపాదనలతో టీమిండియా టీ20 కెప్టెన్ రేసులోకి మరొక పేరు వచ్చి చేరింది.

Team India: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే! కోచ్ గంభీర్ సూచనతో..
Hardik Pandya, Gautam Gambhir
Follow us on

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశంగా మారింది. క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటివరకు హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే యంగ్ ప్లేయర్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ లు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే గంభీర్ ప్రతిపాదనలతో టీమిండియా టీ20 కెప్టెన్ రేసులోకి మరొక పేరు వచ్చి చేరింది. అతనే 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైనట్లు క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటాడని గతంలో వార్తలు వచ్చాయి. కాగా, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించిందని క్రిక్‌ఇన్‌ఫో నివేదించింది. దీని ప్రకారం శ్రీలంకతో జరిగే సిరీస్‌తో భారత్ టీ20 జట్టుకు సూర్య కెప్టెన్‌గా కనిపించనున్నాడని సమాచారం.

సూర్యకుమార్ యాదవ్ ఇంతకు ముందు 7 టీ20 మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. కీలక ఆటగాళ్ల గైర్హాజరీ మధ్య భారత జట్టుకు సారథ్యం వహించిన సూర్య.. 5 మ్యాచ్‌ల్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇప్పుడు జులై 27 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ద్వారా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో బీసీసీఐ టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయాల్సి వచ్చింది. దీని ప్రకారం రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా పేర్లు కొత్త కెప్టెన్ రేసులో వినిపించాయి. అయితే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వెనక్కి నెట్టి భారత జట్టు కెప్టెన్సీని అందుకోవడంలో సూర్యకుమార్ యాదవ్ సక్సెస్ అయ్యాడని క్రిక్ ఇన్ఫో పేర్కొంది. దీంతో రోహిత్ శర్మ వారసుడిగా సూర్యకుమార్ కనిపించనున్నాడని నివేదించింది.

ఇవి కూడా చదవండి

దీనికి ముందు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. అయితే ఫిట్‌నెస్ సమస్య కారణంగా ప్రతి సిరీస్‌లో హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండటం అనిశ్చితంగా ఉంది. అందుకే శాశ్వత సభ్యుల్లో ఒకరికి నాయకత్వం వహించాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా పట్టం కట్టినట్లు తెలిసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..