సానియా మీర్జాను కలుసుకోనున్న షోయాబ్ మాలిక్
భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్ను చూసివచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ ఆల్రౌండర్ షోయాబ్ మాలిక్కు ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనుమతించింది. లాక్ డౌన్ కారణంగా సానియా మీర్జా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. భర్త షోయాబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉన్నారు. ఇప్పడు అంతర్జాతీయ విమాన సర్వీసలు ప్రారంభం కావటంతో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు అనుమతి లభించింది. ఇక్కడే నెల రోజుల పాటు ఉండనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ కు వెళ్తారు. జులై […]
భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్ను చూసివచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ ఆల్రౌండర్ షోయాబ్ మాలిక్కు ఎట్టకేలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనుమతించింది. లాక్ డౌన్ కారణంగా సానియా మీర్జా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. భర్త షోయాబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉన్నారు.
ఇప్పడు అంతర్జాతీయ విమాన సర్వీసలు ప్రారంభం కావటంతో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు అనుమతి లభించింది. ఇక్కడే నెల రోజుల పాటు ఉండనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ కు వెళ్తారు. జులై 24న ఇంగ్లాండ్లో జరిగే సిరీస్ ఆడనున్నారు. పాకిస్తాన్.. ఇంగ్లాండ్తో మూడు టెస్టులు, మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడనున్నది.
దాదాపు ఐదు నెలలుగా వీరు దూరంగా ఉంటుండటంతో సానియా మీర్జా కాసింత నిరాశ కు లోనయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో కూడా తెలిపారు. తన భర్త లేకుండానే రంజాన్ జరుపుకుంటున్నట్లు ట్వీట్ కూడా చేశారు.