ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
లష్కరే తోయిబా(LeT)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్లో భద్రత దళాలతో కలిసి పోలీసులు జరిగిన స్పెషల్ ఆపరేషన్లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాలో చేరినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని జకీర్ అహ్మద్, అబిద్ హుస్సేన్ వానిగా గుర్తించారు. మరొకరిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు కొత్తవారిని […]
లష్కరే తోయిబా(LeT)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్లో భద్రత దళాలతో కలిసి పోలీసులు జరిగిన స్పెషల్ ఆపరేషన్లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాలో చేరినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని జకీర్ అహ్మద్, అబిద్ హుస్సేన్ వానిగా గుర్తించారు. మరొకరిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు కొత్తవారిని చేర్చుకోవటం లేదు. అయితే యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాను ఉపయోగింస్తున్నట్లుగా తెలుస్తోంది.